Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ఇన్స్యూరెన్స్!

జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ఇన్స్యూరెన్స్!
, మంగళవారం, 27 జులై 2021 (17:23 IST)
జ‌న‌సేన కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు... ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. కార్య‌క‌ర్త‌లంద‌రికీ అయిదు లక్షల రూపాయ‌ల ఇన్సూరెన్స్ కల్పించారు ప‌వన్ కళ్యాణ్. జనసేన పార్టీలో క్రియాశీలక  సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలని ఈ ప‌ని చేశారు.

దురదృష్టవ‌శాత్తు ఎవరికి అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రతి కార్యకర్త కు 5 లక్షలు రూపాయ‌లు ఇన్సూరెన్స్ చేశారు. అలాగే ప్రమాదం జరిగి హాస్పటల్లో చికిత్స పొందే వారికి ఖర్చులు నిమిత్తం 50 వేల‌ రూపాయ‌లు ఇస్తారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ అధ్య‌క్షుడు కె. ధర్మారావు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ బాండ్స్‌ను మైలవరం నియోజకవర్గం ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన రావు (గాంధి) చేతులు మీదుగా ఇచ్చారు.
webdunia
ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త  పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల‌ని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, అధికారంలోకి రావటానికి ప్రతి ఒకరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మూర్తి ఎంపీటీసీ సభ్యులు కాంతకుమారి, కిరణ్, ప్రవీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతరత్న ఎ.పి.జె అబ్దుల్ కలాం, మననం చేసుకుందాం