Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జ‌గ‌న్ ఇంటి ముందే ఉద్య‌మిస్తాం: జ‌న‌సేన ప‌వ‌న్

సీఎం జ‌గ‌న్ ఇంటి ముందే ఉద్య‌మిస్తాం: జ‌న‌సేన ప‌వ‌న్
, బుధవారం, 7 జులై 2021 (16:52 IST)
సిఎం జ‌గ‌న్ భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా? ఆడపడుచులను పచ్చి బూతులు తిడతారా? 
ఇటువంటి నాయకులు ఉంటే..‌మానభంగాలు ఎలా ఆగుతాయి? సిఎం ఇంటి‌చుట్టూ ఉన్న‌వారికే రక్షణ లేదు... అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

సీఎం నివాసం తాడేప‌ల్లిలో 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాల‌ని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడర‌ని, ఖాళీ చేయించడం తప్పనిసరైతే, వారికి ముందు న్యాయం చేయాలి... 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే వారిని తొలగించాల‌న్నారు. కాద‌ని, మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సిఎం నివాసం వద్దే ఉద్యమిస్తాం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. 
 
జ‌న‌సేన కార్యాల‌యంలో పవన్ కళ్యాణ్‌ను తాడేపల్లి అమరరెడ్డి కాలనీవాసులు క‌లిసి, త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ చుట్టూ ఉన్నవారికి ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారు. తొలుత వేరే స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నార‌ని, అర్ధరాత్రి ప్రొక్లెయిన్ లను ఇళ్ల మీదకు పంపిస్తున్నార‌ని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నార‌ని బాధితులు ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న మాకు గూడు లేకుండా చేస్తున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు అండగా నిలబడి ఉద్యమం చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Modi cabinet expansion: 43 మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ