Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు మంత్రులకు జగన్ వార్నింగ్... తీరు మార్చుకోకపోతే...!!

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (12:57 IST)
ఏపీ సీఎం జగన్ అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నారు. తాను ఎలాంటి వాడినని ఆయన ప్రతి విషయంలో రుజువు చేస్తున్నారు. ఇక తాను ఏరి కోరి మంత్రులను తీసుకున్నారు. వారి పనితీరు నెల రోజులను మధింపు చేశారు. ఇక మంత్రుల పేషీలు చూస్తే జాతరను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ నవ్వుతూ.. అన్నా.. అమ్మా అంటూ పిలిచే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. 
 
కేబినెట్‌లో ఏరి కోరి తెచ్చుకున్న ఆ అయిదుగురికి సీఎం తనకు ఆగ్రహం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించారు. తాము ఏం చేసినా ఎక్కడో క్యాంపు కార్యాలయంలో కూర్చొనే ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రులకు ఆధారాలతో సహా ఏం చేసారో వివరించారు. తాను గతంలోనే చెప్పానని..ఇప్పుడు హెచ్చరిస్తున్నానని..మరో సారి ఇదే విధంగా జరిగితే మంత్రులుగా మీరు ఉండరు అని తేల్చి చెప్పేసారు.
 
వారిలో సీనియర్ మంత్రి జగన్ చెప్పిన సమాచారంతో బిత్తర పోయారు. మిగిలిన నలుగురు బతికిపోయాం అంటూ బయటపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే బదిలీలపై పెద్ద ఎత్తున పైరవీలు మంత్రుల పేషీల్లోనే జోరుగా జరిగిపోతున్నాయి. 
 
ఆ అయిదుగురు మంత్రుల బంధుగణమైతే అన్నీ తామై వ్యవహరిస్తోంది. ఈ విషయం జగన్ దృష్టికి రాగానే మండిపోయారని టాక్. మరి మంత్రులకు ఇది ఫస్ట్ వార్నింగ్. తీరు మార్చుకోకపోతే ఇంతే సంగతులేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments