Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కార్లలో ఎర్ర చందనంతో దొరికిపోయిన వైసిపి నేత?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:13 IST)
ఆయన అధికార పార్టీ నాయకుడు. ప్రజలకు సేవ చేసి.. మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఆయనే పెడదారి పట్టాడు. డబ్బులు సంపాదించాలన్న దురుద్ధేశంతో ఎర్రచందనం అక్రమ రవాణానే మార్గంగా ఎంచుకున్నాడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండల జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడు. పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రస్తుతం ఉన్నారు. 

 
చిత్తూరు జిల్లా పీలేరులో తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనంను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారు చిన్న గొట్టిగల్లు జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, క్రిష్ణయ్యగా గుర్తించారు. 
 
అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదట.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments