Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కార్లలో ఎర్ర చందనంతో దొరికిపోయిన వైసిపి నేత?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:13 IST)
ఆయన అధికార పార్టీ నాయకుడు. ప్రజలకు సేవ చేసి.. మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఆయనే పెడదారి పట్టాడు. డబ్బులు సంపాదించాలన్న దురుద్ధేశంతో ఎర్రచందనం అక్రమ రవాణానే మార్గంగా ఎంచుకున్నాడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండల జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడు. పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రస్తుతం ఉన్నారు. 

 
చిత్తూరు జిల్లా పీలేరులో తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనంను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారు చిన్న గొట్టిగల్లు జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, క్రిష్ణయ్యగా గుర్తించారు. 
 
అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments