వివాహితపై అఘాయిత్యం.. భర్తతో కలిసి మద్యం సేవించి ఆపై...

ఠాగూర్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (10:03 IST)
ఏపీలోని ఏలూరులో ఓ వివాహితహై సామూహిక అఘాయిత్యం జరిగింది. వివాహిత భర్తతో కలిసి మద్యం సేవించిన కొందరు యువకులు ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ దారుణం ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, భార్యతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. ఒకటో పట్టణ రామకోటి ప్రాంతంలో ఉంటూ పగలు హోటళ్లలో పనిచేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వీరు రాత్రివేళ రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీపై నిద్రించేవారు.
 
చిన్నచిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగే నగరానికి చెందిన ముగ్గురు యువకులు వీరికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వివాహిత భర్తతో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అతడిపై దాడిచేసి ఆయన భార్యను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపైనా దాడి చేశారు. 
 
మరోవైపు, యువకులు తన భార్యను లాక్కెళ్లడంతో నిస్సహాయుడైన భర్త రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఓ యువకుడికి విషయం చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లే సరికి నిందితులు ముగ్గురూ పరారయ్యారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. వీరిని చెంచు కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డ విజయ్కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments