Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడ శ్రీనివాస్‌తో కొత్తింటిలోనే కలిసివుంటాను.. భార్య వాణి

సెల్వి
ఆదివారం, 18 ఆగస్టు 2024 (01:19 IST)
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. భార్యతో సెటిల్ చేసుకొని, విడాకులు తీసుకుంటానని స్పష్టం చేశారు. దాంతో ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరింది. దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత వాణి కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి దువ్వాడ శ్రీను ఇంటి వద్దకు వచ్చారు. 
 
గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తనకు ఆస్తి అవసరం లేదని మరో డ్రామాకు తెరతీశారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని చెబుతున్నారు. శ్రీను కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పారు. తనకు ఏ ఆస్తి వద్దు, కూతుళ్ల భవిష్యత్‌ను శ్రీను చూసుకుంటే చాలని కొత్త పల్లవి అందుకున్నారు. కానీ వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ ఇష్టపడటం లేదు.

తాజాగా వాణి మీడియాతో మాట్లాడుతూ.. తన సమస్యలను ఎవరితోనూ పంచుకోని శ్రీను.. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటారని వాణి అన్నారు. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.

ఆడబిడ్డల భవిష్యత్తు కోసం.. ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను... అంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ

సి.ఎం. సహాయనిధికి కోటి ఇచ్చిన చిరంజీవి, సాయి దుర్గతేజ్ పది, అలీ మూడు లక్షలు అందజేత

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

కలి పాత్ర నేపథ్యంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిసున్న కలి మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments