Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ దిగుదాం రా బావా అంటూ భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన భార్య (video)

ఐవీఆర్
శనివారం, 12 జులై 2025 (15:43 IST)
ఇటీవలి కాలంలో భర్తలను ఓ పథకం ప్రకారం హత్య చేస్తున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. ఆమధ్య మేఘాలయలో ఇండోర్ నగరానికి చెందిన ఓ వివాహిత భర్తను హత్య చేయించి ఏమీ ఎరగనట్లు నటించింది. ఆ తర్వాత అసలు విషయం బైటపడింది. తాజాగా ఇటువంటి ఘటనే కర్నాటక-తెలంగాణ సరిహద్ద ప్రాంతంలో కృష్ణా నది వద్ద జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... తన భర్తను నది వద్ద సెల్ఫీ దిగుదామంటూ పిలుచుకుని వెళ్లింది ఓ భార్య. అతడు కాస్త దూరంగా నిలబడి చూస్తుండగా, వంతెనపై నుంచి సెల్ఫీ దిగుదామంటూ పిలుచుకుని వెళ్లింది. అలా సెల్ఫీ దిగుతుండగా భర్తను అమాంతం ప్రవహిస్తున్న కృష్ణా నదిలోకి తోసేసింది. అతడు మునిగిపోతాడేమోనని చూస్తూ వున్న మహిళకు చేదు గుళిక అడ్డం పడింది.
 
నదిలో ఓ బండరాయిని ఆసరాగా చేసుకుని సదరు వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుని పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఇక అతడు చనిపోయే అవకాశం లేదని గ్రహించిన మహిళ.. తన భర్తను కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. అది గమనించిన స్థానికులు అతడిని తాడు సాయంతో బైటకు లాగి కాపాడారు. బైటకు వచ్చిన భర్త.. తనను సెల్ఫీ పేరుతో చంపేద్దామని ప్లాన్ చేసావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇదే విషయాన్ని ఫోనులో తన కుటుంబ సభ్యులకు తెలియజేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments