Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:03 IST)
భర్త అంటే ప్రేమే. కానీ తరచూ తాగి రావడం ఆ ఇల్లాలికి ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మనకి పిల్లలు లేరు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. భయంగా ఉంటోంది. నన్ను చూసుకోవాల్సింది నువ్వేగా.. ఇలా నువ్వు తాగి వస్తే ఎలా అని భర్తను ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ అతనిలో మార్పు రాలేదు. అయితే ఏ అలవాటులేని ఒక డిగ్రీ విద్యార్థికి ఆ మహిళ కనెక్టయ్యింది. అతనితో సహజీవనం మొదలెట్టింది. కానీ చివరకు..

 
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కెంకెర గ్రామానికి చెందిన దివ్య అనే యువతికి నాథన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. దివ్యకు 22 యేళ్ళు. నాథన్‌కు 38యేళ్ళు. వయస్సు ఎక్కువగా ఉన్నా తల్లిదండ్రులు వివాహం చేశారు.

 
నాథన్ వైన్ షాప్‌కు ఓనర్. ఆస్తి బాగా ఉండడంతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళికి ముందు బాగానే ఉన్నా.. పెళ్ళి తరువాత చెడు స్నేహాలు ఎక్కువై తాగుడు బానిసయ్యాడు నాథన్. దీంతో ప్రతిరోజు తాగి రావడమే పనిగా పెట్టుకున్నాడు. భర్తను ఎన్నో విధాలుగా మార్చాలని చూసింది భార్య.

 
పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసి ఆటోడ్రైవర్‌గా ఉన్న రాకేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేత సంబంధానికి దారితీసింది.

 
భర్తతో ఇక ఉండలేనని నిర్ణయించుకుని 20 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ప్రియుడితో వేరే కాపురం పెట్టింది. సహజీవనంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే మూడురోజుల క్రితం దివ్యకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా వదిలేశాడు రాకేష్.

 
దీంతో తాను చేసిన తప్పు ఎలాంటిదో తలుచుకుని కుమిలిపోయింది దివ్య. తన భర్తపై తనకు ఇంకా ప్రేమ ఉందంటూ ఒక లేఖను రాసింది. ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి అంటూ ఆ లేఖలో పేర్కొని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments