Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో విద్యార్థినిని కారులో అత్యాచారం అత్యాచారం

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిత్యంతో ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిపై అత్యాచార జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై రఘుపతి అనే యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు విహారయాత్ర కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య కొందరు విద్యార్థులను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. విహార యాత్ర ముగిసిన తర్వాత తిరిగి అర్థరాత్రి సమయంలో స్కూలుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. దీంతో ఆ విద్యార్థిని రఘుపతికి అప్పగించి, ఆమెను ఇంటివద్ద దింపాలంటూ హెచ్ఎం సూచించాడు. 
 
ఇదే అదునుగా భావించిన రఘుపతి.. బాలికను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెడ్మాస్టర్‌ వెంకటయ్యను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం