Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని వరంగల్ ఎంజీఎం వైద్యురాలు సూసైడ్ అటెంప్ట్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వంరగల్ జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ వైద్య కాలేజీకి చెందిన వైద్యురాలు ఒకరు విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎంజీఎం వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. 
 
కాకతీయ వైద్య కాలేజీలో పీజీ అనస్తీషియాగా విద్యాభ్యాసం చేస్తున్నా డాక్టర్ ధరవాత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో వున్నపుడు ఆమె హానికరమైన ఇంజెక్షన్ వేసుకున్నారు. దీన్ని తోటి వైద్యులు గుర్తించి ఆమెకు అత్యవసర సేవల విభాగానికి తరలించి చికిత్స అందించారు. 
 
అయితే, ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించి విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని సీనియర్ వైద్యులు వేధించారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై ప్రీతి ఫిర్యాదు మేరకు సీనియర్ వైద్యులను కూడా ప్రిన్సిపల్ మందలించినట్టు సమాచారం. అయినప్పటికీ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments