Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైన్ స్నాచింగ్‌కు పాల్పడి... మహిళ గొలుసును మింగేసిన యువకుడు..

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:58 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ గొలుసును మింగేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు యువకులు దొంగతనాలకు పాల్పడేవారు. వీరిద్దరూ దిబిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. 
 
దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో పక్కనే ఉన్న పోలీసులు ఆ కేకలు విని... బైక్ మీద పారిపోతున్న దొంగలను కిలోమీటరు దూరం వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. 
 
వెంటనే అతణ్ని రాంచీ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయగా, నిందితుడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గొలుసు ఎక్కువ సేపు ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ చేసి వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments