Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మలు విక్రయించి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 7 మే 2023 (15:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ కసాయి భార్య.. కట్టుకున్న భర్తను కడతేర్చింది. కిరాయి మూకలకు డబ్బులు ఇచ్చేందుకుతన వద్ద ఉన్న కమ్మలను విక్రయించి సుపారీ ఇచ్చి, ఈ దారుణానికి ఒడిగట్టింది. సుపారీగా రూ.2 లక్షలు ఇవ్వడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
 
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందల్వాయి అనే గ్రామంలో గోపాల్, పీరుభాయి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిసకావడంతో సాయంత్రానికి మద్యం సేవించి ఇచ్చి భార్యను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. భర్త వేధింపులకు విసిగిపోయిన ఆమె... భర్త పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రమంలో చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, వీరికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చేలా డీల్ మాట్లాడుకుంది. వారిద్దరూ పన్నిన పథకం ప్రకారం గత నెల 30వ తేదీన గోపాల్‌ను కిరాతకంగా హత్య చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భార్యే ఈ హత్యకు సూత్రధారిగా తేలింది. సుపారీ ఇచ్చేందుకు తన వద్ద ఉన్న కమ్మలు విక్రయించి రూ.2 లక్షలు చెల్లించినట్టు విచాలణలో వెల్లడైంది. దీంతో పీరుబాయితో పాటు గోపాల్, చందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్స్, ఓ బైకు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments