Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తి కోసం తమ్ముడిని చంపేశారు... పేపర్ కట్టర్‌తో గొంతు కోసేశాడు...

murder
, ఆదివారం, 7 మే 2023 (11:29 IST)
ఆస్తిని తమ్ముడికి పంచి ఇవ్వాల్సి వస్తుందన్న అక్కసుతో తమ్ముడిని అన్న చంపేశాడు. పేపర్ కట్టర్‌తో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగంరోలని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట మార్కెట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మలక్ పేట మున్సిపల్ కాలనీకి చెందిన అశోక్ అనే వ్యక్తికి సుమతి, బాలామణి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సుమతికి కుమారుడు మల్లేశ్ (30)తో సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలామణికి నవీన్ (24) అనే కుమారుడు ఉన్నారు. వీరంతా అంబర్‌పేటలోని ప్రేమ నగరులో జీ ప్లస్ వన్ భవంతిలో ఉంటున్నారు. సుమతి, మల్లేశ్ గ్రౌండ్‌ఫ్లోరులో ఉంటుండగా, బాలామణిలు మొదటి అంతస్తులో ఉంటున్నారు. అశోక్ మాత్రం పిండిగర్నీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మల్లేశం, నవీన్‌ల మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. తమ్ముడికి ఆస్తి పంచి ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని మల్లేశం అతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. తన పథకంలో భాగంగా, తండ్రి అశోక్ సమక్షంలోనే పంచాయతీ తేల్సుకుందామని చెప్పిన నవీన్‌ను వెంట బెట్టుకుని బైకు‌పై బయలుదేరాడు. నవీన్ బైకు నడుపుతుండగా, వెనుక మల్లేశం కూర్చొన్నాడు. 
 
మలక్ పేట మార్కెట్‌లో నుంచి వెళ్లేందుకు సుబ్బయ్య హోటల్ పక్క వీధి నుంచి మార్కెట్‌లోకి బైకు వెళ్లింది. అక్కడ కొంత నిర్మానుష్యంగా ఉండటంతో వెనుక కూర్చొన్న మల్లేశ్.. బైకును నడుపుతున్న నీవన్‌ను పేపర్ కట్టర్‌తో గొంతు కోశాడు. ఈ ఘటనతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ నుంచి పారిపోయేందుకు మల్లేశ్ ప్రయత్నించగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పది' ఫలితాల్లో ఫెయిల్.. మనస్తాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య