కాపాడండి అని కాల్ చేస్తే వచ్చి ఆమెనే హత్య చేసారు, ఎందుకు?

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (13:34 IST)
అమెరికాలో దారుణం జరిగింది. తనను కాపాడమంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫోన్ చేస్తే... తీరా ఆమెను కాపాడాల్సిన పోలీసులే ఆమెను తుపాకీతో కాల్చి చంపేసారు. ఆమె కన్నకూతుళ్లు కళ్ల ముందే ఈ దారుణ ఘటన జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అమెరికాలోని లాస్ ఏంజిలిస్ కౌంటిలోని 27 ఏళ్ల నియాని తన మాజీ బోయ్ ఫ్రెండు వేధింపులకు పాల్పడుతున్నాడనీ, తనను చంపేస్తానంటూ భయపెడుతున్నాడనీ, తనను కాపాడాలంటూ పోలీసులకి ఫోన్ చేసింది. ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే ఆమె నివాసానికి వెళ్లారు. ఐతే ఆమెను కాపాడాల్సిన పోలీసులు బాధితురాలినే తుపాకీతో కాల్చి చంపేసారు.
 
ఇలా ఎందుకు జరిగిందన్న దానికి వారు వివరణ ఇస్తూ... తాము బాధితురాలిని కాపాడేందుకు వెళ్లేసరికి ఆమె చేతిలో పదునైన కత్తి వుంది. ఆ ఆయుధంతో తన మాజీ బోయ్ ఫ్రెండును పొడిచేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. ఆ పని చేయవద్దని తాము ఎంతగా వారించినప్పటికీ ఆమె వినలేదనీ, వేరే మార్గం లేక ఆమెను తుపాకీతో గాయపరచాల్సి వచ్చిందన్నారు. ఐతే ఆమె గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లామనీ, కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.
 
కాగా దీనిపై బాధితురాలి పెద్దకుమార్తె మాట్లాడుతూ... తన తల్లి అలా కత్తితో బెదిరించలేదనీ, పోలీసులే కాల్చి చంపేసారని ఆరోపించింది. దీనితో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ కోర్టుకు ఎక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments