Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ విషాదకర ఘటన సంభవించింది. ఓ యువకుడు ఫ్లెక్సీ కడుతూ దుర్మరణం పాలయ్యాడు. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి లోనుకావడం ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా అధికార తెరాస పార్టీ నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 
 
దీంతో కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద తెరాస ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనలో మరో యువకుడు కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments