Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పి తగ్గిస్తానని బొడ్డుచుట్టూ కొరికిన భూత వైద్యుడు...

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ భూతవైద్యుడు మూడు నెలల శిశువు ప్రాణాలు తీశాడు. కడుపు నొప్పి తగ్గిస్తానని చెప్పి బొడ్డు చుట్టూ కొరికాడు. అతని పంటిగాట్లకు శిశువు పెద్దపేగు తెగిపోయింది. దీంతో ఆయన్ని అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఇది కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడులో మంగళవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానినికి చెందిన ఆశా కార్యకర్త నాగమణి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. రెండు, మూడు రోజులుగా బాబు ఏడుస్తున్నాడు. గ్రామానికి చెందిన భూతవైద్యుడు దేవరబాల (పూనకం వచ్చే వ్యక్తి) వద్దకు తీసుకెళ్లగా అతడు శిశువు బొడ్డుచుట్టూ కొరికాడు. 
 
అయినా బాలుడు ఏడుపు ఆపకపోవడంతో కరకగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆశ కార్యకర్త నాగమణికి ఫోన్‌ చేశారు. ఆమె 108కు సమాచారం అందించడంతో అదే వాహనంలో బాలుడిని భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. 
 
వైద్యులు పరిశీలించగా చిన్నపేగు తెగినట్లు తేలింది. ఆ గాయంతోనే బాలుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇది ఎలా జరిగిందని వైద్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని శిశువు తల్లిదండ్రులు వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments