Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై భర్త దాడి!!

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (16:34 IST)
తాను చేసిన అప్పులు తీర్చలేక పోయిన వ్యక్తి.. తన భార్యపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. తాను అప్పులు తీసుకున్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. భర్త తెచ్చిన ప్రతిపాదనకు భార్య అంగీకరించలేదు. దీంతో ఆమెను పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాను చేసిన అప్పులు తీర్చేందుకు స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని హుణసగి నివాసి భీమణ్ణ భాగలేర అనే వ్యక్తి తన భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో జూలై 25వ తేదీన ఆమెను హత్య చేశాడు. అపరిచితులు ఎవరో తన భార్యను హత్య చేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. విచారణలో అతనే హత్య చేశాడని గుర్తించి శహపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. 
 
గత నెల మొదటి వారంలో అరెస్టు చేశారు. తన భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో హత్య చేశాడని ఆరోపించాడు. మృతురాలి సోదరుడికి తన బావ చేసిన ఆరోపణల్లో నిజం లేదని గుర్తించారు. తన సోదరి చరవాణిని పరిశీలించగా అందులో కాల్ రికార్డింగ్‌లను విని నిర్ఘాంతపోయాడు. తన బావ చేసిన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతోనే హత్య చేశాడని పోలీసులకు ఆదివారం మరో ఫిర్యాదు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments