Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లోనే ఉరేసుకున్నారు. బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంధ్రకుమారి, రాంబాబులు ఆరోపించారు. 
 
తమకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైన తర్వాతి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారని తెలిపారు. ఇంట్లో శాడిస్ట్‌గా, సైకోగా ఉంటూ బయట మాత్రం మంచివాడిగా ప్రవర్తించేవారన్నారు. 
 
ఆ మేరకు ఫిర్యాదు చేయాలని మంచిర్యాల సీఐ నారాయణనాయక్‌ జ్యోతి కుటుంబసభ్యులకు సూచించగా తమ కుమార్తె మరణానికి కారణమైన బాలకృష్ణను తమకు అప్పగించాలని, అప్పటివరకు ఫిర్యాదు చేయబోమని గొడవకు దిగారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తెలపడంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి వారు అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments