Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లోనే ఉరేసుకున్నారు. బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంధ్రకుమారి, రాంబాబులు ఆరోపించారు. 
 
తమకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైన తర్వాతి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారని తెలిపారు. ఇంట్లో శాడిస్ట్‌గా, సైకోగా ఉంటూ బయట మాత్రం మంచివాడిగా ప్రవర్తించేవారన్నారు. 
 
ఆ మేరకు ఫిర్యాదు చేయాలని మంచిర్యాల సీఐ నారాయణనాయక్‌ జ్యోతి కుటుంబసభ్యులకు సూచించగా తమ కుమార్తె మరణానికి కారణమైన బాలకృష్ణను తమకు అప్పగించాలని, అప్పటివరకు ఫిర్యాదు చేయబోమని గొడవకు దిగారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తెలపడంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి వారు అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments