Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ సందేశాలు పంపుతూ వల, ఇతర రాష్ట్రాల నుంచి యువతులు...

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (19:44 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో అసాంఘిక కార్యకలాపాలతో కొంతమంది అపవిత్రం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి ఆ తరువాత సరిపెట్టేస్తున్నారన్న విమర్సలు లేకపోలేదు.
 
తాజాగా తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్‌కు సమీపంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేవలం వాట్సాప్ లోనే అందమైన యువతుల ఫోటోలను పంపించి రేటు మాట్లాడి ఆ తరువాత ఈ వ్యాపారాన్ని చేసే ముఠాలోని కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
గత కొన్నినెలలుగా జ్యోతి అనే ఒక మహిళ పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అది కూడా అలిపిరి పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటకు వచ్చింది.
 
ఐదుగురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే నిర్వాహకురాలు జ్యోతిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులను కోర్టుకు తరలించగా యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments