Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారంలో నష్టం : ఉరేసుకున్న భర్త - చెరువులో దూకిన భార్య

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఆ దంపతుల మధ్య కలహాలు చెలరేగాయి. దీంతో భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుుకంది. దీంతో ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మునిపల్లి మండలం, గార్లపల్లికి చెందిన చంద్రకాంత్, లావణ్య దంపతులు బీహెచ్ఈఎల్‌లో స్థిరపడ్డారు. వీరికి ప్రథమ్ (8), సర్వజ్ఞ (3) ఇనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, చంద్రకాంత్ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 
 
ఈ వ్యాపారంలో ఆశించినంత పురోగతి లేకపోగా, నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల నుంచి ఆయన కోలుకోలేక పోయాడు. ఫలితంగా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా కలత చెందిన చంద్రకాంత్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన భార్య లావణ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆందోళ్ పెద్ద చెరువులో దూకి ఆత్మత్య చేసుకుంది. ఈ మృతదేహాలను శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వచ్చిన మృతదేహాలను స్వాధీనం చేసుకన్నారు. మరో మృతదేహాం కోసం గజ ఈతగాళ్ళతో గాలిస్తున్నారు. కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments