Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్

ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్
, మంగళవారం, 30 నవంబరు 2021 (14:29 IST)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ విధుల్లో చేరిన మరుక్షణం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన మార్క్‌తో సమస్యలు ఎలాంటివైనా వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆర్టీసీకి సంబంధించి ఎవరైనా ఏదైనా స్పందిస్తే తక్షణం వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను తెలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆయన బస్సుల్లో ప్రయాణించారు. 
 
తాజాగా మరోమారు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. సజ్జనార్ కుటుంబంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 
 
పైగా, ఈ బస్సులో ఆయన స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ కనిపించారు. ఆర్టీసీ బస్సులో సపరివార సమేతంగా బస్సులో ప్రయాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాగ్ అగ్రవాల్ నుండి సుందర్ పిచాయ్ వరకు.. టాప్-10 సీఈవోలు వీరే