Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళపై లైంగికదాడికి యత్నం... నిందితుడు బిహార్ వాసి!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (11:48 IST)
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళా ప్రయాణికురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో మహిళ రైలు నుంచి కిందపడడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రైలు వేగం తగ్గింది.
 
అదే సమయంలో ఎస్-2 బోగీలో ఉన్న ఓ మహిళ వాష్ రూము నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా మద్యం మత్తులో డోర్ వద్ద ఉన్న యువకుడు ఆమె నడుము పట్టుకుని కిందికి లాగాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. రైలు కొద్దిదూరం వెళ్లిన తర్వాత యువకుడు కూడా కిందపడ్డాడు. కిందపడిన మహిళ నడుచుకుంటూ సమీపంలోని తండా వద్దకు వెళ్లి విషయం చెప్పింది. 
 
వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి అంబులెన్స్‌లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అలాగే, రైల్వే పట్టాలపై పడి ఉన్న నిందితుడిని కూడా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతడిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం