Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో మైనర్‌ కిడ్నాప్.. అత్యాచారం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (13:44 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికకు రాత్రంతా నరకం చూపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ధోల్​పుర్​ జిల్లా బారీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భరత్‌పూర్‌లో ఈ నెల 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్​కు వెళ్లింది. అదేసమయంలో ఓ యువకుడు.. తన బైక్​పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్​ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు. 
 
అక్కడ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యులు తమ కుమార్తె కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు ఉదయం ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. 
 
వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments