నవ దంపతులది పరువు హత్య కాదు, ఎఫైర్ హత్య: పోలీసులు వెల్లడి

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (19:29 IST)
కులాంతర వివాహం చేసుకున్న నవ వధువు తమిళనాడులోని కుంభకోణం సమీపంలో సోమవారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా హత్య చేసారు. ఈ జంట హత్యలకు పాల్పడిన వారు నవ వధువు సోదరుడు, ఆమె బంధువు. వీరిని అరెస్టు చేశారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవ వధువు ఇంతకుముందే హత్యకు పాల్పడ్డ బంధువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతడిని దూరం పెట్టి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నందుకు పార్టీ ఇస్తాను రమ్మని నూతన దంపతులను పిలిపించాడు సోదరుడు. అప్పటికే ఆమె మాజీ ప్రియుడు, బంధువు మాటు వేసి వున్నాడు. వారు ఇంట్లోకి రాగానే ఆమె మాజీప్రియుడు, సోదరుడు ఇద్దరూ కలిసి హతమార్చారు.

 
మహిళ షెడ్యూల్డ్ కులానికి చెందినది కాగా ఆమె భర్త అత్యంత వెనుకబడిన కులానికి చెందినవారు. అయితే ఇది పరువు హత్య కేసు కాదని కొందరు అంటున్నారు. ఇది పరువు హత్య కేసు కాదు అని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

 
దాడి చేస్తున్న సమయంలో తన కుమార్తె  చావు కేకలు విన్న వధువు తల్లి పరుగున వచ్చి చూడగా కుమార్తె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె భర్త కూడా అదే పరిస్థితిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments