Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (11:58 IST)
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ యువతి... తల్లి స్థానాన్ని కూడా మరచిపోయింది. తాను ప్రియుడుతో కలిసి ఉండగా, పిల్లలు చూశారని, వారిని విచక్షణా రహితంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసింది. ఎట్టకేలకు ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లగా, వారు పిల్లలను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
 
పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారదకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి రాహుల్, రేణుక ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విభేదించి తాడిచర్లకు చెందిన ప్రియుడు నల్లవెలుగుల పవన్‌తో కలిసి ఆమె జంగారెడ్డిగూడెం పట్టణంలో సహజీవనం చేస్తోంది. 
 
శనివారం రాత్రి తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ రాహుల్‌ను ఆమె ప్రియుడు పవన్ వైరుతో వీపుపై తీవ్రంగా కొట్టాడు. రాహుల్ భయంతో బయటికి పరుగులు తీయగా స్థానికులు గమనించి శారద, పవన్‌లకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కొంతకాలంగా పవన్, శారదలు పిల్లలలిద్దరినీ కొడుతూ, గాయాలపై కారం చల్లి, తమ నోట్లో పచ్చిమిరపకాయ పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని బాధిత బాలుడు రాహుల్ తెలిపాడు. ఆదివారం ఈ సమాచారం కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి వెళ్లడంతో, ఆమె ఈ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments