Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (11:58 IST)
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ యువతి... తల్లి స్థానాన్ని కూడా మరచిపోయింది. తాను ప్రియుడుతో కలిసి ఉండగా, పిల్లలు చూశారని, వారిని విచక్షణా రహితంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసింది. ఎట్టకేలకు ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లగా, వారు పిల్లలను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
 
పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారదకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి రాహుల్, రేణుక ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విభేదించి తాడిచర్లకు చెందిన ప్రియుడు నల్లవెలుగుల పవన్‌తో కలిసి ఆమె జంగారెడ్డిగూడెం పట్టణంలో సహజీవనం చేస్తోంది. 
 
శనివారం రాత్రి తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ రాహుల్‌ను ఆమె ప్రియుడు పవన్ వైరుతో వీపుపై తీవ్రంగా కొట్టాడు. రాహుల్ భయంతో బయటికి పరుగులు తీయగా స్థానికులు గమనించి శారద, పవన్‌లకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కొంతకాలంగా పవన్, శారదలు పిల్లలలిద్దరినీ కొడుతూ, గాయాలపై కారం చల్లి, తమ నోట్లో పచ్చిమిరపకాయ పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని బాధిత బాలుడు రాహుల్ తెలిపాడు. ఆదివారం ఈ సమాచారం కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి వెళ్లడంతో, ఆమె ఈ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments