Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో నీచాతి నీచం .. ఏడాదిన్నర బాలిక మృతదేహంపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్‌లోని తంగర ప్రాంతంలో ఒక నీచాతి నీచమైన ఘటన జరిగింది. యేడాదిన్నర వయస్సుండే ఓ బాలిక మృతదేహాపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
తంగర్ ప్రాంతానికి చెందిన యేడాదిన్నర బాలిక గుండెలో రంధ్రం ఉండటంతో చికిత్స పొందుతూ ఈ నెల 25వ తేదీన మృతిచెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అయితే, మరుసటి రోజు రోజు కర్మక్రతువులు చేసేందుకు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి బంధువులు వెళ్లి చూడగా, అక్కడి దృశ్యాన్ని చూసి వారు చలించిపోయారు. 
 
బాలిక మృతదేహం మట్టిపై పడివుంది. బాలిక శరీరంపై నూలు పోగు కూడా లేదు. దీంతో బంధువులు మృతదేహంపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శవపరీక్ష రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే, ఇంత నీచానికి దిగజారిన కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments