ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:58 IST)
ఢిల్లీలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడుని దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో మూడు నెలల పాటు హోటల్‌లో బస చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. చివరకు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌ సిబ్బందికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడు. నకిలీ బిజినెస్ కార్డును చూపించి మూడు నెలల పాటు హోటల్‌లోనే ఉన్నాడు. దీంతో అతని మొత్తం బిల్లు రూ.23,46,413కు చేరుకుంది. 
 
ఆ తర్వాత బిల్లును చెల్లించకుండా హోటల్‌కు చెందిన విలువైన వస్తువులతో పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది ఈ నెల 14వ తేదీన ఢిల్లీ సరోజిని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments