Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:58 IST)
ఢిల్లీలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడుని దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో మూడు నెలల పాటు హోటల్‌లో బస చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. చివరకు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌ సిబ్బందికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడు. నకిలీ బిజినెస్ కార్డును చూపించి మూడు నెలల పాటు హోటల్‌లోనే ఉన్నాడు. దీంతో అతని మొత్తం బిల్లు రూ.23,46,413కు చేరుకుంది. 
 
ఆ తర్వాత బిల్లును చెల్లించకుండా హోటల్‌కు చెందిన విలువైన వస్తువులతో పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది ఈ నెల 14వ తేదీన ఢిల్లీ సరోజిని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments