Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:58 IST)
ఢిల్లీలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడుని దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో మూడు నెలల పాటు హోటల్‌లో బస చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. చివరకు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌ సిబ్బందికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడు. నకిలీ బిజినెస్ కార్డును చూపించి మూడు నెలల పాటు హోటల్‌లోనే ఉన్నాడు. దీంతో అతని మొత్తం బిల్లు రూ.23,46,413కు చేరుకుంది. 
 
ఆ తర్వాత బిల్లును చెల్లించకుండా హోటల్‌కు చెందిన విలువైన వస్తువులతో పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది ఈ నెల 14వ తేదీన ఢిల్లీ సరోజిని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments