Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం ఆలస్యంగా చేసిందనీ కోడలిని కాల్చి చంపిన మామ!!

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:41 IST)
ఉదయం వేళ అల్పాహారం ఆలస్యం చేసిందన్న కోపంతో ఇంటి కోడలిని మామ కాల్చి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేకు చెందిన కాశీనాత్ పాటిల్ (76) అనే వ్యక్తి ఓ పారిశ్రామికవేత్త. ఈయన కోడలు పేరు సీమా రాజేంద్ర. 
 
అయితే, గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, ఆయనకు వడ్డిచండంలో జాప్యమైంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. 
 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగా, శుక్రవారం కన్నుమూసింది దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments