Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

ఐవీఆర్
మంగళవారం, 13 మే 2025 (16:02 IST)
దేశంలో సంచలనం సృష్టించింది తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని దోషులుగా నిర్ణయిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ 9 మంది పురుషులకు బ్రతికున్నంతవరకూ జైలుశిక్షను విధించింది. వీరి బారిన పడ్డ మహిళలకు రూ. 85 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 
 
ఈ కేసుకు సంబంధించి వివరాలను చూస్తే... సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలు చేసేవారు. ఆ తర్వాత లైంగిక దాడి చేస్తూ వీడియోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవారు. ఎవరికైనా నిజం చెబితే వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగేది ఆ ముఠా. ఈ ముఠాలో శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్, మణివణ్ణన్, బాబు, పాల్, అరుళానందం దోషులుగా తేలారు.
 
2019లో బాధిత మహిళలు ఫిర్యాదుతో వీరి అఘాయిత్యాలు బైటపడ్డాయి. వందలాదిమంది అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. సీబీఐ దర్యాప్తులో 9 మందిపై కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, పదేపదే అత్యాచారం వంటి అభియోగాలు నమోదయ్యాయి. కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు వీరిని దోషులకు తేల్చి శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం