అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

ఐవీఆర్
మంగళవారం, 13 మే 2025 (16:02 IST)
దేశంలో సంచలనం సృష్టించింది తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని దోషులుగా నిర్ణయిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ 9 మంది పురుషులకు బ్రతికున్నంతవరకూ జైలుశిక్షను విధించింది. వీరి బారిన పడ్డ మహిళలకు రూ. 85 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 
 
ఈ కేసుకు సంబంధించి వివరాలను చూస్తే... సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలు చేసేవారు. ఆ తర్వాత లైంగిక దాడి చేస్తూ వీడియోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవారు. ఎవరికైనా నిజం చెబితే వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగేది ఆ ముఠా. ఈ ముఠాలో శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్, మణివణ్ణన్, బాబు, పాల్, అరుళానందం దోషులుగా తేలారు.
 
2019లో బాధిత మహిళలు ఫిర్యాదుతో వీరి అఘాయిత్యాలు బైటపడ్డాయి. వందలాదిమంది అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. సీబీఐ దర్యాప్తులో 9 మందిపై కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, పదేపదే అత్యాచారం వంటి అభియోగాలు నమోదయ్యాయి. కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు వీరిని దోషులకు తేల్చి శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం