Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

ఠాగూర్
ఆదివారం, 6 జులై 2025 (12:16 IST)
కోల్‌కతా నగరంలోని న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు వస్తున్నాయి. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా గంటల తరబడి కాలేజీ ప్రాంగణంలోనే గడిపినట్టు తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి స్నేహితులు తమ పైశాచికత్వానికి చాటుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు జూన్ 25వ తేదీన ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితులు ముగ్గురూ కొన్ని గంటల పాటు నిందితులు కాలేజీలోని సెక్యూరిటీ గార్డు గదిలోనే ఉన్నారు. అక్కడే మద్యం తాగి ఆపై ఈఎం బైపాస్‌లోని ఓ ధాబాకు వెళ్లి భోజనం చేశారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని సెక్యురిటీ గార్డు పినాకి బెనర్జీని బెదిరించి, మరుసటి రోజు ఉదయం తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. 
 
పరిస్థితి తీవ్రతను గ్రహించిన మనోజిత్ మిశ్రా జూన్ 26వ తనకు గతంలో సాయం చేసిన దేశప్రియ పార్క్‌లోని ఓ పలుకుబడిగల వ్యక్తిని సంప్రదించాడు. అయితే, కేసు తీవ్రతను గమనించిన ఆ వ్యక్తి సాయం చేయడానికి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తనను కాపాడే వారి కోసం మనోజిత్, రాష్ బిహారీ, గరియాహత్, ఫెర్న్ రోడ్ వంటి నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లినట్టు మొబైల్ టవర్ డేటా ఆధారంగా గుర్తించామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

తమన్ జడ్జిగా సీజన్ 4 తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కడ?

కొత్త లోకా: చాప్టర్ వన్ – చంద్ర రివ్యూ, దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ కు మార్కులు

Allu Family: విశాఖలో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. వైరల్ అవుతున్న పాత ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments