అక్కను వేధిస్తున్నాడని బావను రైలు కింద తోసేసి చంపేశాడు...

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (10:37 IST)
మద్యం మత్తులో తరచూ తన అక్కను వేధిస్తున్న బావను రైలు కిందికి తోసి హత్య చేశాడో బావమరిది. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిందీ ఘటన. పోలీసులు కథనం మేరకు... పాత మలక్ పేటకు చెందిన సిరాజ్ (29), యాకుత్‌పురకు చెందిన సానియా (23)ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుని అత్తారింట్లో ఉంటున్నాడు. సిరాజ్ నిత్యం మద్యం తాగి సానియాను కొడుతూ వేధించేవాడు. ఈ నెల 2వ తేదీన సిరాజ్ తన భార్యను తీసుకుని ఓల్డ్ మలక్‌పేటలోని తన ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. 
 
భర్త నిత్యం తనను హింసిస్తుండటంతో సానియా తన తమ్ముడు సయ్యద్ జమీర్ (21)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే జమీర్ తన స్నేహితుడు ఎండీ జునైద్ (23)తో కలిసి అక్కడకి చేరుకున్నాడు. అర్థరాత్రి సమయంలో జమీర్, జునైద్ ఇద్దరూ సిరాజ్‍ను బైక్‌పై ఎక్కించుకుని మలక్ పేట రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిరాజ్, జమీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జమీర్ అటువైపు వస్తున్న రైలు కిందకు సిరాజ్‌ను తోసివేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. 
 
రైల్వే పోలీసులు స్టేషన్‌ ప్రాంగణంలోని నిఘా కెమెరాల సాయంతో సయ్యద్ జమీర్, అతడికి సహకరించిన జునైద్‌ను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

iBomma నాదని మీకెవరు చెప్పారు?: ఇమ్మడి రవి షాకింగ్ రిప్లై

Ghantasala: ఘంటసాల ది గ్రేట్ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

Anil Ravipudi: చిరంజీవి, వెంకటేష్ అల్లరి, డ్యాన్స్, ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు: అనిల్ రావిపూడి

Trivikram Srinivas: శుక్రవారం వచ్చే మొదటి ఫోన్ కాల్‌కి ఓ భయం ఉంటుంది : త్రివిక్రమ్ శ్రీనివాస్

Film Chamber: మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

తర్వాతి కథనం
Show comments