Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మకు సారీ చెప్తేనే ఇంటికి వస్తానన్న భర్త... ఆత్మహత్య చేసుకున్న భార్య

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (15:24 IST)
తన అమ్మను క్షమాపణలు కోరితేనే ఇంటికి వస్తానని భర్త భీష్మించి కూర్చోవడంతో మనస్తాపం చెందిన ఇల్లాలు ఇంట్లోనే ఉరేసుకున ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరారం ఆర్జేకే కాలనీకి చెందిన ఎస్కే ఫర్జానా (35), ఎక్సే ఖదీర్ వలీ అనే దంపతులు ఉన్నారు. వీరికి 2011లో వివాహమైంది. అయితే, మద్యానికి బానిస అయిన ఖదీర్ వలీ.. గత కొంతకాలంగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్త మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కుమార్తెకు స్కూలు ఫీజు చెల్లించే విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త ఖదీర్ వలీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత భర్తకు ఫర్జానా వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నప్పటికీ ఇంటికి రావాలంటూ ప్రాధేయపడింది. అయితే, తన తల్లికి సారీ చెప్తేనే తాను వస్తానన తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఫర్జానా ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దంపతులకు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments