Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా బంధువు అమ్మాయిని ప్రేమించావా.. అయితే రూ.5 లక్షలు చెల్లించు..

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (12:04 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో పవన్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు గల కారణాలను పోలీసుల విచారణలో వెల్లడైంది. 'మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ.5 లక్షలు చెల్లించు' అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు పవన్‌ను డిమాండ్‌ చేశాడు. అయితే, సంబంధిత సొమ్మును చెల్లించకపోవడంతోనే అతడిని సదరు యువతి బాబాయి, అతడి స్నేహితుడు కలిసి దారుణంగా ఆ యువకుడిని హతమార్చారు. 
 
బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసును బాలాపూర్‌ పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. వాది ఎ ఉమర్‌లో నివసించే పూల్‌సింగ్‌ కుమారుడు పవన్‌(22) తన చెల్లెలి ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆ విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు పహాడీషరీఫ్‌కు మకాం మార్చారు. 
 
అనంతరం యువతి బాబాయి, ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ గౌస్‌(30).. ఈ విషయాన్ని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు మహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. అతను పవన్‌ను పిలిచి.. యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నందుకు క్షమించి వదిలేస్తామని, రూ.5 లక్షలు  చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఆ నగదులో తమకు వాటా లభిస్తుందని యువతి బాబాయి ఆశపడ్డాడు. ఆ తర్వాత తన తండ్రికి బెదిరింపుల విషయాన్ని పవన్ తెలిపాడు. 
 
అయితే, తాము అంత మొత్తం ఇవ్వలేమని.. 40 వేలు చెల్లిస్తామంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడికి పవన్‌ తండ్రి చెప్పాడు. దీంతో యువతి బాబాయి గౌస్‌.. తన మిత్రుడు బార్కస్‌లో ఉండే మహ్మద్‌ సద్దాం(23)తో కలిసి పవన్‌ను కత్తులతో పొడిచి హతమార్చాడు. పెళ్లి బారాత్‌లో వినియోగించే కత్తులను నాందేడ్‌ నుంచి తెప్పించారని, పవన్‌ హత్యకు నిందితులు వాటినే వినియోగించినట్లు వారు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments