Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సొంత జిల్లాలో భార్య కాలు, చెయ్యి నరికేసిన భర్త..

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా కట్టుకున్నకాడే కిరాతకంగా ప్రవర్తించాడు. అనుమానంతో భార్య కాలు, చేయి నరికివేసి, పత్తాలేకుండా పారిపోయాడు. ఈ దారుణం కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తండాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ (45) భార్యాభర్తలు. 25 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన నాగనాయక్ గొడ్డలితో భార్య కాలు, చేయి నరికేశాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు నాగనాయక్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments