Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డ చాతిలో పొడిచిన తల్లిదండ్రులు!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (08:59 IST)
గుడుంబా, గంజాయి మత్తులో అనేక పలు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డను ఛాతిలో పొడించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ దంపతులతో పాటు మరో ఇద్దరు కుమారులు నిత్యం గుడుంబా మత్తులో ఉంటూ పొద్దస్తమానం గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మలు తమ రెండో కుమారుడు అశోక్‌ను గుడుంబా కోసం డబ్బులు అడగ్గా అతను నిరాకరించాడు. 
 
దీంతో కోపం పెంచుకున్న ఆ దంపతులు.. గుడుంబా తాగి... ఆ మత్తులో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్‌ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతిపై పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖర్.. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments