Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డ చాతిలో పొడిచిన తల్లిదండ్రులు!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (08:59 IST)
గుడుంబా, గంజాయి మత్తులో అనేక పలు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డను ఛాతిలో పొడించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ దంపతులతో పాటు మరో ఇద్దరు కుమారులు నిత్యం గుడుంబా మత్తులో ఉంటూ పొద్దస్తమానం గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మలు తమ రెండో కుమారుడు అశోక్‌ను గుడుంబా కోసం డబ్బులు అడగ్గా అతను నిరాకరించాడు. 
 
దీంతో కోపం పెంచుకున్న ఆ దంపతులు.. గుడుంబా తాగి... ఆ మత్తులో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్‌ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతిపై పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖర్.. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments