గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డ చాతిలో పొడిచిన తల్లిదండ్రులు!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (08:59 IST)
గుడుంబా, గంజాయి మత్తులో అనేక పలు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డను ఛాతిలో పొడించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ దంపతులతో పాటు మరో ఇద్దరు కుమారులు నిత్యం గుడుంబా మత్తులో ఉంటూ పొద్దస్తమానం గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మలు తమ రెండో కుమారుడు అశోక్‌ను గుడుంబా కోసం డబ్బులు అడగ్గా అతను నిరాకరించాడు. 
 
దీంతో కోపం పెంచుకున్న ఆ దంపతులు.. గుడుంబా తాగి... ఆ మత్తులో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్‌ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతిపై పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖర్.. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments