Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కావాలన్న కోరికతో కూతుళ్లను అత్యాచారం చేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:40 IST)
తన కుమారుడు కావాలన్న కోరికతో తన ఇద్దరు కుమార్తెలపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాంత్రికుడి మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి జీవితకారాగారశిక్షను కోర్టు విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సమీపంలోని బక్సర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చాలా కాలంగా కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. కుమారుడు కావాలంటో అజయ్ కుమార్ అనే మాంత్రికుడి వద్దకు వెళ్ళాలని బంధువు చెప్పాడు. దీంతో ఆ మాంత్రికుడిని ఆ దంపతులు కలిశారు. ఇద్దరు కుమార్తెల వల్లే కుమారుడు పుట్టడం లేదని నమ్మించాడు. పైగా, కొడుకు పుట్టాలంటే కూతుళ్లను రేప్ చేయాలని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తండ్రి కుమార్తెలపై లైంగికదాడికి పాల్పడుతూ చ్చాడు. వారికి తల్లి, ఆమె సోదరి కూడా సహకరించారు. 
 
కేవలం తండ్రి మాత్రమే కాకుండా, అపుడపుడు మాంత్రికుడు అజయ్ కుమార్ కుమార్ అత్యాచారం చేయసాగాడు. ఇలా వారిద్దరి పెట్టే లైంగిక వేధింపులను భరించలేని ఆ ఇద్దరు కుమార్తెలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన సమయానికి బాధితురాళ్ల వయసు 14, 16 సంవత్సరాలు మాత్రమే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కామాధులైన తండ్రికి, మాంత్రికుడికి జీవితకారాగార శిక్ష విధించగా, తల్లికి, ఆమె సోదరికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం