Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు సెంట్ల భూమి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (16:15 IST)
ఆరు సెంట్ల భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని కడతేర్చాడు. 50 యేళ్ల వయసులో ఉన్న తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు. కన్నతండ్రిపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఏపీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు సమీపంలోని నాగాయలంక మండలం బవదేరపల్లికి చెందిన హరి మోహన్ అనే వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశాడు. ఆయన భార్య కొన్ని నెలల క్రితం మంచానపడింది. ఈ క్రమంలో కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీన్ని తండ్రి హరిమోహన్ పలుమార్లు మందలించాడు. దీంతో కసిపెంచుకోవడంతో పాటు తన తండ్రి పేరిట ఉన్న ఆరు సెంట్ల భూమిపై కన్నేశాడు. ఆ భూమి విక్రయించి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో తండ్రీకుమారుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇదే విషయంపై తండ్రితో గొడవపడిన తలపై బలంగా కొట్టాడు. దీంతో హరిమోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆపై ఇంట్లోనే తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగ బయటకు రావడంతో గమనించిన ఇరుగు పొరుగువారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments