Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మృతితో ఒంటరిగా మారిన టీచర్ ... మానసిక ఒత్తిడితో ఆత్మహత్య

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (13:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో చందానగర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్య మృతితో ఒంటరి అయిన ఒక ప్రొఫెసర్.. మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఒంటరిగా జీవించలేక తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణాలోని చందానగర్ పాత ఎంఐజీ కాలనీకి చెందిన తాళ్లూరి రాధా ఫణి ముఖర్జీ (47) అనే వ్యక్తి మేడ్చల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈయన భార్య ఒక యేడాది క్రితం చనిపోయింది. ఈ క్రమంలో గురువారం కాలేజీకి రావడం లేదని యాజమాన్యానికి ఫోను చేసి చెప్పాడు.
 
అదే రోజు సాయంత్రం ఇంట్లోనుంచి తలుపులువేసుకుని బయటకు రాలేదు. పైగా కళాశాల నుంచి, నగరంలో ఉంటున్న సోదరి, ఇద్దరు సోదరులు కూడా ఫోన్లు చేసినా లిఫ్టు చేయలేదు. దీంతో శుక్రవారం సోదరి, సోదరుడు వచ్చి తలుపులు తెరవగా ఫ్యానుకు తాడుతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంట్లో సూసైడ్ లేఖ లభించింది. తన కుమారుడు రేవంత్‌కు తన ఆస్తులు అందించాలని కోరాడు. తన మృతికి ఎవరూ కారకులు కాదని పేర్కొన్నాడు. భార్య మృతి కారణంగా ఒతితిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments