Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

Advertiesment
gold coins
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:02 IST)
పసిడి ప్రియులకు షాక్ తగులుతుంది. వరుసగా మూడో రోజు కూడా వీటి ధరలు పెరిగాయి. ఈ నెల 23వ తేదీన నుంచి వీటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 
 
23వ తేదీన హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక బంగారం ధర రూ.5430గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ.43360గా ఉంది. అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.54300గా ఉంది. గురువారంతో పోల్చితే ఈ బంగారం ధరతో 100 రూపాయలు పెరిగింది. 
 
ఇకపోతే, 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5923గా ఉంటే 8 గ్రాముల బంగారం ధర రూ.47384గాను, 10 గ్రాముల బంగారం ధర రూ.59230గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100కు పెరిగింది. 
 
వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర రూ.76.70గాను 8 గ్రాముల వెండి ధర రూ.613.60గా, 10 గ్రాముల వెండి ధర రూ.767గా ఉంది. నిన్నటిధరతో పోల్చితే శుక్రవారం పది గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే మూడు రోజులు విస్తారంగా వర్షాలు