Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

rain
, గురువారం, 24 ఆగస్టు 2023 (10:54 IST)
తెలుగు రాష్ట్రాలను మరోసారి వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
తెలంగాణలో మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఎల్లో, గ్రీన్ అలర్ట్‌లను వాతావరణ శాఖ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం: 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం