Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీ కోసం రిక్షాకార్మికుడి హత్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 జులై 2022 (09:36 IST)
ఓ తాగుబోతు ఒక చపాతీ కోసం రిక్షా కార్మికుడిని హత్య చేశాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 26వ తేదీ రాత్రి పది గంటల సమయంలో మున్నా (40) అనే రిక్షా కార్మికుడు మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని కారోల్‌ బాఘ్‌లో చపాతీ తింటున్నాడు. ఇంతలో అక్కడకు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. 
 
ఫిరోజ్ ఖాన్ అప్పటికే పీకల వరకు మద్యం సేవించడంతో మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో మున్నాను ఓ చపాతీ అడిగాడు. అతను ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మున్నాతో ఫిరోజ్ ఖాన్ వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డాడు.
 
దీంతో రిక్షా కార్మికుడు కూడా ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన ఫిరోజ్ ఖాన్.. తన వద్ద ఉన్న పదునైన కత్తితో మున్నాను పొడిచి చంపేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి మున్నాను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను చిక్కకుండా పారిపోయాడు. ఆ తర్వాత మరికొందరి సాయంతో మున్నాను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారైన ఫిరోజ్ ఖాన్‌‍ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments