Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానది ఒడ్డుకి ట్రాలీ బ్యాగ్‌తో కోడలు, తెరిచి చూస్తే అత్త మృతదేహం ముక్కలు

ఐవీఆర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:50 IST)
స్వయంగా ఓ కోడలు అత్తను హత్య చేసి ట్రాలీ బ్యాగులో పెట్టుకుని గంగానది తీరానికి వచ్చింది. ఆమె వాలకం అనుమానం కలగడంతో అక్కడివారు అందులో ఏముంది అని ప్రశ్నించారు. కుక్క మృతదేహం వుందని ఆమె చెప్పింది కానీ బ్యాగు తెరిచి చూసిన స్థానికులు షాక్ తిన్నారు. అందులో ఆమె అత్త మృతదేహం ముక్కలు చేసి అందులో వున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర కోల్ కతా గంగా నది ప్రాంతంలోని ఘాట్ రోడ్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఇద్దరు మహిళలు ఓ ట్రాలీ బ్యాగును మోయలేక మోయలేక కిందకి దించారు. ఆ తర్వాత దాన్ని మెల్లగా ఈడ్చుకుంటూ నదివైపు వెళుతున్నారు. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్నవారికి వీరి వాలకంపై అనుమానం వచ్చింది. అందులో ఏమున్నదంటూ ప్రశ్నించారు. కుక్క చచ్చిపోతే దాన్ని ఈ సూట్ కేసులో పెట్టి పడేసేందుకు వచ్చామని చెప్పారు.
 
ఐతే కుక్క చస్తే ఎక్కడో శివారులోనో, మునిసిపాలిటీ వారికో చెప్పాలి కానీ ఇంత ఖరీదైన బ్యాగులో ఎందుకు వేసుకు వస్తున్నారంటూ అక్కడివారు ప్రశ్నించారు. ఐతే వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వని మహిళలు త్వరత్వరగా బ్యాగును గంగలో పడేసేందుకు ముందుకు వెళ్తున్నారు. దీనితో వారిని అక్కడివారు అడ్డగించి ఆ బ్యాగులో ఏముందని బలవంతంగా తెరిచారు. అంతే... బ్యాగు చూసి షాక్ తిన్నారు. అందులో వున్నది ఓ మహిళ శవం, ముక్కలు చేసి వున్నది. దీనితో పోలీసులకు సమాచారం అందించారు. వారి విచారణలో తేలిందేమిటంటే.... తన అత్తను హత్య చేసి ఇలా పెట్టెలో పెట్టి గంగలో పడేసేందుకు కోడలు వచ్చింది. దీనికి సహాయం చేసేందుకు ఆమె తల్లి కూడా వచ్చింది. ఐతే ఆ మహిళను ఎందుకు హత్య చేసారన్నది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments