Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

సెల్వి
శనివారం, 8 మార్చి 2025 (13:43 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. కర్ణాటకలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయేల్ నుంచి కర్ణాటకకు వచ్చిన టూరిస్ట్ యువతి.. ఒక హోమ్ స్టే ఓనర్ ఇంట్లో దిగింది. వీరంతా గురువారం రాత్రి..  తుంగ‌భ‌ద్ర కెనాల్‌ను చూసేందుకు వెళ్లారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. మరో ముగ్గురు మగవాళ్లు. ఇంతలో కొంత మంది రాత్రి పూట వీళ్ల దగ్గరకు రెండు బైక్‌ల మీద వచ్చారు. 
 
పెట్రోల్ కావాలని మొదట వచ్చారు. ఆతర్వాత డబ్బులు డిమాండ్ చేశారు.నఇవ్వకుండా నిరాకరించడంతో పురుషుల్ని తుంగభద్రకేనాల్‌లో తోసేశారు. యువతులు ఇద్దరి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.అయితే.. ముగ్గురు యువకుల్లో ఇద్దరి ఆచూకీ లభించింది. మరోక వ్యక్తి జాడ దొరకలేదు.ఈ ఘటన ప్రస్తుతం కన్నడ నాటు దుమారంగా మారింది.
 
అమెరికాకు చెందిన డేనియ‌ల్‌, మ‌హారాష్ట్ర ప‌ర్యాట‌కుడు పంక‌జ్‌లు కాలువ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఒడిశాకు చెందిన బిబాష్ అనే వ్య‌క్తి ఆచూకీ లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అత్యాచారానికి గురైన మ‌హిళ‌లు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుల్ని గుర్తించామ‌ని, పట్టుకునేందుకు రెండు స్పెష‌ల్ టీమ్స్ ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments