ప్రిన్సిపాల్ కాల్చి చంపిన విద్యార్థి.. మృతుడి బైకుపైనే పరారీ...

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థి పాఠశాల హెడ్మాస్టర్‌ (ప్రిన్సిపాల్)ను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మృతుడు బైకుపైనే పారిపోయాడు. తలకు గురిపెట్టి కాల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడుని సురేంద్ర కుమార్ సక్సేనా (55)గా గుర్తించారు. ధమోరా ప్రభుత్వం హయ్యర్ సెకండరీ పాఠశాలలో హెచ్.ఎంగా పని చేస్తున్నారు. అయినా బాత్రూంలో రక్తపు మడుగులో పడి విగతజీవిగా ఉన్న స్థితిలో గుర్తించారు. 
 
సక్సేనా బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయన వెనుకనే వెళ్లిన ఓ విద్యార్థి తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలలో తుపాకీ మోత వినిపించడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హడలిపోయారు. నిందితుడైన 12వ తరగతి విద్యార్థి.. మృతుడు బైకుపైనే పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడుతో కలిసి మరో విద్యార్థి కూడా పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments