Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెడికో హత్యాచార కేసు : ఆర్జీ కర్ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్టు!

arrest

ఠాగూర్

, సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:26 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసులో ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన వద్ద ఏకంగా 16 రోజుల పాటు ప్రశ్నించింది. హత్యాచార కేసు, ఆర్థిక అవకతవకల కేసుల్లో ఆయన వద్ద ఈ విచారణ జరిగింది. 
 
గత నెల 9వ తేదీన ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి సెమినార్ హాల్లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. అయితే, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టి నుంచి ఆయనను ప్రశ్నిస్తూ వచ్చింది. పలుమార్లు ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. 
 
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలోనూ, ఆర్జీ కర్ వైద్య కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల విషయంలోనూ సీబీఐ సమాంతర దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు కేసుల్లోనూ సందీప్ ఘోష్‌ను సీబీఐ 16 రోజుల పాటు సుధీర్ఘంగా లోతుగా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయనను సోమవారం అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ చేసిన టీజీఎస్సార్టీసీ