Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్ కాల్చి చంపిన విద్యార్థి.. మృతుడి బైకుపైనే పరారీ...

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థి పాఠశాల హెడ్మాస్టర్‌ (ప్రిన్సిపాల్)ను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మృతుడు బైకుపైనే పారిపోయాడు. తలకు గురిపెట్టి కాల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడుని సురేంద్ర కుమార్ సక్సేనా (55)గా గుర్తించారు. ధమోరా ప్రభుత్వం హయ్యర్ సెకండరీ పాఠశాలలో హెచ్.ఎంగా పని చేస్తున్నారు. అయినా బాత్రూంలో రక్తపు మడుగులో పడి విగతజీవిగా ఉన్న స్థితిలో గుర్తించారు. 
 
సక్సేనా బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయన వెనుకనే వెళ్లిన ఓ విద్యార్థి తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలలో తుపాకీ మోత వినిపించడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హడలిపోయారు. నిందితుడైన 12వ తరగతి విద్యార్థి.. మృతుడు బైకుపైనే పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడుతో కలిసి మరో విద్యార్థి కూడా పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments