ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలు రాసిపెట్టి ప్రియుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:14 IST)
ఆ యువతిని ఓ యువకుడు తొమ్మిదేళ్ళగా ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను వసూలు చేయాలంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చేతన్ (31) అనే యువకుడు శంకరపురకు చెందిన ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన చేతన్.. తన ప్రియురాలి సరదాలు తీర్చేందుకు తన వేతనంలో సగం జీతం ఖర్చు చేసేవాడు. తన ప్రియురాలు సంతోషంగా ఉంటే చాలని చేతన్ భావించాడు. 
 
కానీ, ఆమె మాత్రం అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికిగురైన చేతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలి సంతోషాల కోసం తాను ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను ఆమె నుంచి వసూలు చేయాలంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments