మహిళా టెక్కీని సజీవదహనం చేసిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (17:58 IST)
చెన్నై నగర శివారు ప్రాంతంలో ఓ మహిళా టెక్కీని ఆమె ప్రియుడే సజీవదహనం చేశారు. శనివారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న తాళంబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రియుడే హంతకుడని తేలింది. చెన్నై పెరుంగుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, చెన్నై సిరుచ్చేరి ఐటీ పార్కులో నందిని (25) ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఈమె మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్‌ ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
మదురైలోని హైస్కూల్ నుంచి నిందితుడు వెట్రిమారన్‌తో నందిని స్నేహంగా మెలుగుతూ వచ్చింది. వెట్రిమారన్ తిరువళ్లూరు జిల్లా ముప్పేడులో నివాసం ఉంటుండగా, నందిని మాత్రం కన్నగి నగర్‌లోని అత్త ఇంట్లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. పైగా, వెట్రిమారన్‌తో ఉన్న పాతకాలపు స్నేహబంధాన్ని కూడా తెంచుకుంది. అయితే, వెట్రిమణిమారన్ ఓ ట్రాన్స్‌జెండర్ అని తేలడంతో అతన్ని దూరంగా పెట్టిన నందిని.. రాహుల్ అనే వ్యక్తిని ప్రేమించసాగింది. ఈ విషయాన్ని  తెలుసుకున్న మణిమారన్ జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
శనివారం నందిని పుట్టిన రోజు కావడంతో సర్‌ప్రైజ్ ఇస్తామని నమ్మించి ఓ ప్రదేశానికి పిలిపించి రాత్రి 7.15 గంటల ప్రాంతంలో హత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఆమె కళ్లకు గంతలు కట్టి..  ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి... బహుమతి ఇస్తానని చెప్పి ఖాళీ ప్లాట్‌లోకి తీసుకెళ్లి మణికట్టు, చీలమండలను కోసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 
 
అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టిన మణిమారన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments