Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (15:38 IST)
ఏపీలో అధికార వైకాపా గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాటు పార్టీ మారనున్నారు. వైకాపా‌కు రాజీనామా చేసి... చంద్రబాబు చెంతకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 5 లేదా 6 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇదేవిషయంపై ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైకాపా టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే, జగ్గంపేట టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు ఆయనకు తేల్చి చెప్పారు. దీంతో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని టీడీపీ నేతలను కోరినట్టు సమాచారం. 
 
2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓడిపోయారు. కానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయనను ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. అయితే, వైకాపా నుంచి టీడీపీలోకి జ్యోతు నెహ్రూ రావడంతో ఆయన వైకాపాలో చేరారు. 2019లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తిరిగి సొంతగూటికి వచ్చేందుకు చంటిబాబు దాదాపుగా నిర్ణయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments