Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్త ఇంటిలో శవమై కనిపించిన నవ వధువు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (11:19 IST)
కర్నాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాబోయే భర్త ఇంటిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఐశ్వర్య, అశోక్ కుమార్ అనే యువతీ యువకులు గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. అయితే, ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా, అశోక్ కుమార్‌లు గౌడ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. కులాంతర వివాహం చేసుకునేందుకు తమతమ తల్లిదండ్రులను వారు ఒప్పించారు. 
 
కానీ, వరుడు తల్లిదండ్రులు కఠిన షరతులు పెట్టారు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఐశ్వర్య కుటుంబ సభ్యులు తమతో సంబంధం కొనసాగించడానికి వీల్లేదని, తమ కుటుంబ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా సమ్మతించారు. 
 
ఈ క్రమంలో ఈ నల 23వ తేదీన వారి వివాహం జరగాల్సివుంది. పెళ్లికి ముందు జరిగే తంతు కూడా మొదలైంది. కానీ, సోమవారం ఉదయానికి వరుడు ఇంటిలో ఐశ్వర్య ఉరికంభానికి వేలాడుతూ కనిపించింది. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు విచారిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కావడం వల్లే హత్య చేశారంటూ మతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments